బతుకమ్మ భిక్కనూరు: తెలంగాణ రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా రేకులపల్లి రాజా గంగారెడ్డి ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాదులో జరిగిన రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సమావేశంలో రాజ్యాంగ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భిక్కనూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న రాజా గంగారెడ్డి ఎన్నిక కావడం సంతోషకరంగా ఉందని సర్వ శిక్ష ఉద్యోగ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్య సంపత్, మండల ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు.