26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రేషన్ డీలర్స్ ఎంఎల్ఎస్ పాయింట్ నిర్వాహణ శైలి వల్ల నష్టపోతున్నాం

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పౌర సరఫరాల శాఖ ఎంఎల్ఎస్ పాయింట్ సిబ్బంది వ్యవహార శైలి వల్ల రేషన్ డీలర్స్ నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ బుధవారం డీలర్ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాయింట్ వద్ద ఆందోళన నిర్వహించి సబ్ కలెక్టర్ వికాస్ మహతోకు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డీలర్ సంఘం జిల్లా అధ్యక్షులు నగేష్ మీడియా ముఖంగా మాట్లాడుతూ ఎంఎల్ఎస్ పాయింట్ సిబ్బంది వల్ల రేషన్ షాపులకు సరఫరా చేసే బియ్యం సరఫరాలో తక్కువగా వస్తుందని ఫలితంగా వినియోగదారులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని ప్రధాన గోదాముల నుండి వచ్చిన బియ్యం తూకం వేయకుండా నేరుగా రేషన్ దుకాణాలకు పంపించడం ద్వారా ఈ సమస్య ఎదురవుతుందని, ఇందులో అవకతవకలు జరుగుతున్నాయని, వెంటనే వీటిని పరిష్కరించి మా రేషన్ డీలర్లను ఆదుకోవాలని సబ్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం నాయకులు భీష్మ గౌడ్, సనా పటేల్, శ్రీనివాస్, సుదర్శన్, ప్రతాప్ గుప్తా తదితర రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

More articles

Latest article