నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో శ్రీ రామనవమి సందర్భంగా హిందూ వాహిని ఇందూరు వారి సహకారంతో శ్రీ విఘ్నేశ్వర యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అభిజిత్ లగ్నంలో శ్రీరాముడు సీతమ్మ వారి మెడలో మూడు ముళ్ళు వేశారు. ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో అన్నదాత కార్యక్రమం లో పాల్గొన్నారు.
