- కామారెడ్డి ఎస్ఈగా రవింధర్ బదిలీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ (ఆపరేషన్స్) గా ఆర్మూర్ డిఇ (ఆపరేషన్) పివి రాజేశ్వర్ రావు నియమితులు అయ్యారు. నిజామాబాద్ విద్యుత్ శాఖ ఎస్ఇగా ఉన్న రాపేల్లి రవింధర్ ను కామారెడ్డి ఎస్ఈగా బదిలీ చేశారు. శనివారం పివి రాజేశ్వర్ రావు విద్యుత్ ప్రగతి భవన్ లో ఎస్ఈగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయం అధికారులు, సిబ్బంది రాజేశ్వర్ రావుకు పుష్పగుచ్చాలు అందచేశారు. ఈ సందర్భంగా సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లాలోని డిఈలు అల్జాపూర్ రమేష్, శ్రీనివాస్ రావు, యండి ముక్తార్, వెంకట మణలతో పాటు ఎడిఈలు తోట రాజశేఖర్, మారేల్లి ఆశోక్, ప్రశాంత్ రెడ్డి, వివిధ సంఘాల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

