ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని నేవూరి రెడ్డి (మాలీష్ పటేండ్లు) సంక్షేమ సంఘానికి శుక్రవారం సంఘం భవనంలో ఎన్నికలు నిర్వహించారు. ప్రత్యర్థి పై ఒక్క ఓటుతో మల్లారపు రాజేందర్ రెడ్డి గెలుపొందాడు. అనంతరం సంఘం ఉపాధ్యక్షులు నవజీవన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నేవూరి గోపాల్ రెడ్డి ,కార్యదర్శి గా నేవూరి వెంకట నరసింహారెడ్డి,కోశాధికారి గా నేవూరి మహేందర్ రెడ్డి , సలహాదారులుగా ముత్యాల ప్రభాకర్ రెడ్డి ,నేవూరి సురేందర్ రెడ్డి సభ్యులుగా ముద్దం బాల్ రెడ్డి , నేవూరి జితేందర్ రెడ్డి ,దుబ్బ ఎల్లారెడ్డి, నేవూరి బాల్ రెడ్డి ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సంఘ అభ్యున్నతి కొరకు కృషి చేస్తానని అన్నారు.ఎన్నికైన వారిని ఘనంగా సన్మానించారు.

