నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు ఏఏఈ లకు ఏడిఈలుగా పదోన్నతులు కల్పిస్తూ ఎన్పీడీసీఎల్ కంపెనీ సీఎండీ వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ డివిజన్ కార్యాలయంలో కమర్షియల్ ఏఏఈగా పనిచేస్తున్న రాజేందర్ రెడ్డి కి ఏడిఈ గా పదోన్నతి కల్పిస్తూ భీంగల్ లో ఆపరేషన్ విభాగం లో పోస్టింగ్ ఇవ్వగా, బుధవారం విధులలో చేరనున్నారు. నగరంలోని ఏడవ సెక్షన్ లో ఏఏఈ గా విధులు నిర్వహిస్తున్న జి. బాబా శ్రీనివాస్ కు డిపిఈ లో ఏడిఈ గా పోస్టింగ్ ఇచ్చారు. ఉత్తర్వులు వెలువడిన నాడే బాబా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు.
