బోధన్, బతుకమ్మ : పట్టణంలోని ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ కావాలన్న ఆలోచనతో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహస్తున్నట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు. ఆకతాయిల ఆగడాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలు గుర్తించి అటువంటి ప్రదేశాల్లో పెట్రోలింగ్ పెంచుతున్నమన్నారు. గంజాయి,మత్తు పదార్థాలు వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.. ఆయన వెంట ఎస్సై, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.