కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు తీర్చలేని భారంగా మారింది
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
వెబ్ న్యూస్, బతుకమ్మ : కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు రాలేదు కానీ..బీఆర్ఎస్ నేతల జేబులు నిండాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీ ఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై రూ. లక్షా 30 వేల కోట్లు ఖర్చు చేస్తే మేడిగడ్డ కూలిపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు తెలంగాణ ప్రజలు ఎన్నటికీ తీర్చలేనంత భారంగా మారిందని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీ ఆర్ఎస్ ప్రభుత్వం కనీసం టెలిమెట్రీలు కూడా ఏర్పాటు చేయలేదన్నారు.
