ఈనెల 17న నిర్ణయం వెల్లడించాలని ఆదేశం
వరంగల్ పోలీసులకు నోటీసులు జారీ
హైదరాబాద్, బతుకమ్మ : హనుమకొండలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభపై విచారణను ఈనెల 17కు హైకోర్టు వాయిదా వేసింది. ఈవిషయమై వరంగల్ పోలీసులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. సభ అనుమతిపై ఈనెల 17న నిర్ణయం వెల్లడించాలని ప్రభుత్వ లాయర్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 27న హనుమకొండలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.