- ఎస్ఐ సందీప్
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో వినాయక చవితి పండగ సందర్భంగా వినాయకులను స్థాపించే వారు తప్పకుండా అవగాహన సదస్సుకు హాజరుకావాలని ఎస్ఐ సందీప్ కోరారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలలో రాబోయే వినాయక చవితి పర్వదిన సందర్భంగా ఎవరైతే గణేష్ మండపా నిర్వాహకులకు రేపు తేదీ గురువారం ఉదయం 10:00గంటలకు ఇందల్వాయి పోలీస్ స్టేషన్ నందు శాంతి కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు.కావున గణేష్ నిర్వాహకులు ఇట్టి సమావేశంకు అందరూ హాజరు కావాలన్నారు.
