పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలి

0 14,544
  • ఎంపీ ధర్మపురి అరవింద్

 

నిజామాబాద్, బతుకమ్మ : పెండింగ్ పనులను త్వరతగతిన పూర్తిచేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో బుధవారం జిల్లాలోని పలు ఆర్వోబీలు, ఇతర రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై జిల్లా కలెక్టర్ తో కలిసి రైల్వే, ఆర్ అండ్ బి, నేషనల్ హైవే, ఇతర శాఖల అధికారులు కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు.

Pending tasks should be completed quickly

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే స్టేట్​ ఫైనాన్స్​ మినిస్టర్​ను కలుస్తానని తెలిపారు. నగర శివారులోని మాధవనగర్, అర్సపల్లి, అడవి మామిడిపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.కోట్లల్లో నిధులు రావాల్సి ఉందన్నారు. ప్రధానంగా మాధవనగర్​కు సంబంధించి రూ.3 కోట్లు, రివైజ్​డ్ నిధులు రూ.8.5కోట్లు పెండింగ్​లో ఉన్నాయన్నారు. అర్సపల్లి ల్యాండ్​కు సంబంధించి సుమారు రూ.10 కోట్లు హోల్డ్​లో ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి వారం రోజుల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని కలుస్తానని పేర్కొన్నారు.

Pending tasks should be completed quickly

Leave A Reply

Your email address will not be published.