అన్యాక్రాంతమైన దేవాదాయ భూముల పరిశీలన
హైదరాబాద్, బతుకమ్మ : దేవుడి భూములు కబ్జా చేస్తే పీడీ యాక్టు పెట్టి శిక్షిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కబ్జాదారులను హెచ్చరించారు. వరంగల్ వెళ్తూ మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల ఐఓసీ వద్ద అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను మంత్రి కొండా సురేఖ పరిశీలించి మాట్లాడారు.