నవీపేట్, బతుకమ్మ : మండలంలోని బినోల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి,వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్ర పటాలకు బినోల సహకార సంఘం చైర్మన్ మగ్గరి హన్మండ్లు, పాలకవర్గ సభ్యులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా మగ్గరి హన్మండ్లు మాట్లాడుతు సహకార సంఘాల పదవికాలం మరో ఆరు నెలలు పొడిగించినందుకు సీఎం రేవంత్ రెడ్డి,వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేశ్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రైతులకు అందుబాటులో ఉంటూ సొసైటీ సేవలు అందిస్తామన్నారు. ఈకార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు విజయ్,ఆంజాగౌడ్,గంగాధర్, బాలు చందర్,మొగులయ్య రైతులు ఆయిటి గంగాధర్, మహేందర్,రాంకిషన్,మురళి,రమేష్,నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
