బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో వర్ని చౌరస్తా వద్ద బోయ గల్లి ప్రాంతానికి చెందిన కిషన్ అనే వ్యక్తి గాజుల్ పెట్ నుండి వర్ని చౌరస్తాకు వెళ్తుండగా డీసీఎం ఢీకొని కిషన్(45) మృతి చెందాడు. సంఘటన స్థలానికి ఐదవ టౌన్ ఎస్సై గంగాధర్ వచ్చిపరిశీలించి కేస్ దర్యాప్తు చేస్తున్నారు. డీసీఎం వ్యాన్ ఢీకొని పారిపోతుండగా స్థానికులు ఐదో టౌన్ వద్ద పట్టుకొని పోలీసులకు అప్పగించారు.