రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో గత వారం రోజులుగా తాగు నీరు రావడం లేదని, తాగు నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ప్రధాన రహదారి పై బైఠాయించి రాస్తారోకో నిర్వహించడంతో అధికారులు స్పందించి బుధవారం సాయంత్రం బోరు మోటారుకు మరమ్మత్తులు చేయించి తాగు నీటి సమస్యను పరిష్కరించి త్రాగు నీరు అందించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
