బోధన్, బతుకమ్మ: మండల ప్రణాళిక, గణాంక అధికారి (ఎంపీఎస్ వో) ఆధ్వర్యంలో బోధన్ మండలంలోని ఎరాజ్ పల్లిలో శనివారం నిర్వహించిన వరికోత ప్రయోగాన్ని సబ్కలెక్టర్ వికాస్ మహతో పరిశీలించారు. పంట నాణ్యత, కోత పద్ధతులు, రైతుల అభిప్రాయాలను సబ్ కలెక్టర్ సమీక్షించారు. పంట ఉత్పత్తి సామర్థ్యం పెరగడం, పంట కోత ప్రక్రియలో ఆధునిక పద్ధతులను అమలు చేయడంపై సబ్ కలెక్టర్ సూచనలు చేశారు. ఆయనవెంట సంబంధిత అధికారులు, గ్రామస్తులు, రైతులు ఉన్నారు.
