హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్కి జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. గత నెల 13 రాజేంద్రనగర్ పోలీసుల వేధింపులతో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ఆటో డ్రైవర్ మృతిని జాతీయ మానవహక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఆటో డ్రైవర్ మృతి పట్ల విచారణ చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని జాతీయ మానవహక్కుల కమిషన్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.