బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ పిట్ల మీనా ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయాన్ని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకొని ఏర్గట్ల మండల పద్మశాలి సంఘ అధ్యక్షుడు పిట్ల నరేష్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్,మండల పార్టీ అధ్యక్షుడు దేవరెడ్డి, డిసిసి డెలికేట్ గడ్డం జీవన్ రెడ్డి, కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నరసయ్య, ఉపాధ్యక్షుడు బుచ్చన్న, గ్రామ శాఖ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, మూస్కు మోహన్ రెడ్డి, బద్దం లింగారెడ్డి,పన్నాల నర్సారెడ్డి,కూరాకుల బోర్రన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
