27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎంపీ అర్వింద్ ను కలిసిన మున్సిపల్ కమిషనర్లు

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన జగిత్యాల్ నియోజకవర్గ జగిత్యాల, రాయికల్ పట్టణ కౌన్సిలర్లు సోమవారం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ని, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.భోగ శ్రావణి ని హైదరాబాద్ లో వారి నివాసంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబుతో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగిత్యాల్ పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, రాయికల్ పట్టణ అధ్యక్షులు కుర్మా మల్లారెడ్డి, కౌన్సిలర్లు కల్లెడ ధర్మపురి, వేముల శ్రీనివాస్, నిమ్మల నాగరాజు,కొక్కు అనిత, సిరిపురం శ్రీలత-శ్రీనివాస్, గట్టి పెళ్లి జ్ఞానేశ్వర్, కునారపు మానస-భూమేష్, తోపారపు ప్రశాంతి-సురేష్, పుర్రె శ్రీధర్, వేముల మౌనిక-రాము తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article