బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం దొన్ పాల్ గ్రామమలో గల గ్రామీణ ఉపాధి హామీ పథకం లోని ఎస్ జి టి పనులను మోర్తాడ్ మండలం ఎంపీడీఓ తిరుమల దేవి పరిశీలించారు. పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పనులను గురించి అడిగి తెలుసు కున్నారు. అలాగే మస్టర్ రోల్ కాల్ చేయడం జరిగింది. ఉపాధి హామీ కూలీలకు పని విషయంలో ఎటువంటి సందేహాలను తమ దృష్టికి తీసుకెళ్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ లక్ష్మి దుర్గ, ఫీల్డ్ ఆసిసెంట్ రమేష్, ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.
