బతుకమ్మ,మోర్తాడ్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల కోసం మంగళవారం మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి డోన్ కల్, ధర్మోరా, శేట్ పల్లీ, గాండ్లపేట్ గ్రామాలలో పోలింగ్ కేంద్రాల కోసం ప్రభుత్వ పాఠశాలల భవనాలను పరిశీలించారు. భవనాలలో విద్యుత్ కనెక్షన్, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు ఉన్నాయో లేదో పరిశీలించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎం పీ ఓ శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
