ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రంలోని చంద్రాయన్ పల్లి గ్రామంలో ఉపాధి హామీ నర్సరీని మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు గురువారం పరిశీలించారు. నర్సరీలో మొక్కల పెంపకం కొరకు సర్పంచ్ ఆరేటి రఘు, పంచాయతీ కార్యదర్శి అరుణాలను అడిగి తెలుసుకున్నారు. నర్సరీలో గ్రామస్తులకు ఉపయోగపడే మొక్కలు పెంచాలని సూచించారు. నర్సరీలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మొక్కల పెంపకాన్ని నిర్వహించడం జరుగుతుందని, దీనిని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు తెలిపారు.
