నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ జిల్లా కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఇలా త్రిపాఠిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అలాగే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిపి కార్యాలయంలో నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య మర్యాదపూర్వకంగా కలిసారు. జిల్లాలో శాంతి భద్రతలపై చర్చించారు.

