తాడ్వాయి, బతుకమ్మ: తాడ్వాయి మండలం ఎర్రపహడ్ లో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లీ అదృశ్యం అయిన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రేవతి రెండు రోజుల క్రితం ఇద్దరు పిల్లలతో కలిసి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. కుటుంబ సభ్యులు పలు చోట్లా గాలించిన ఆచూకీ లభ్యం కాలేదు. దీనితో పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. ఎవరికైనా కనిపిస్తే పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని కోరారు.
