హైదరాబాద్, బతుకమ్మ: రాష్ట్రంలో 3 అమృత్ భారత్ రైల్వేస్టేషన్స్ ను గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్స్ ను మోదీ ప్రారంభిస్తారని, ఈస్టేషన్లకు సంబంధించిన వీడియోను కిషన్ రెడ్డి ’ఎక్స్‘ వేదికగా పంచుకున్నారు. తెలంగాణ ప్రజలు అధునాతన రైలు ప్రయాణాన్ని అనుభూతి చెందబోతున్నారని పేర్కొన్నారు.
