డిల్లీ, బతుకమ్మ : భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో డిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భేటీ అయ్యారు. ఇరు దేశాల 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో వీరు పాల్గొన్నారు. వాణిజ్యం, రక్షణరంగం, సహాపలు అంశాలపై రెండు దేశాల అధినేతలు చర్చలు జరుపనున్నారు. ఈసందర్భంగా పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. భేటీ అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో వారు మాట్లాడనున్నారు.
