వెబ్ న్యూస్, బతుకమ్మ: భారత్ – పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ఢిల్లీలోని తన నివాసంలో హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, సీడీఎస్ అనిల్ హౌహాన్, త్రివిద దళాధిపతులు హాజరయ్యరు. తాజా పరిణామాలపై చర్చించారు. తదుపరి కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాన మంత్రి కీలక నిర్ణయం తీసుకుని దిశానిర్దేశం చేయనున్నారు.