ఎమ్మెల్సీ సీటు కోసం ఢిల్లీలో మంతనాలు
వెబ్ న్యూస్, బతుకమ్మ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు కోసం విజయశాంతి డిల్లీలో మంతనాలు జరుపుతోంది. ఈమేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసింది. ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని ఢిల్లీ పెద్దలను విజయశాంతి కోరింది. పార్టీ కోసం తాను చేసిన త్యాగాలను పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించింది. బీజేపీ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి చేరారు.