28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

టీయూడబ్ల్యూజే డైరీ ఆవిష్కరించిన ఎమ్మెల్యే పోచారం

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) డైరీనీ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ, సమాజం అభివృద్ధి కి పాటు పడుతున్న జర్నలిస్టుల కోసం ఎల్లవేళలా తన సహకారం ఉంటుందని చెప్పారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పాటు పడుతున్న టీయూడబ్ల్యూజే (ఐజేయు)ను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ఏ లతీఫ్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రాజేష్, పోశిరాం, చంద్రశేఖర్, శ్రీనివాసరావు కులకర్ణి, మోహిన్, యూనుస్, సుధీర్ కుమార్, మహేష్ కుమార్ జర్నలిస్టు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article