ఎల్లారెడ్డి, బతుకమ్మ :తాడ్వాయి మండల కేంద్రంలో గల ఓం శ్రీ శ్రీ శ్రీ పరమహంస సచ్చిదానంద సద్గురు శ్రీ శబరీ మాతాజి వారి 25వ రజతోత్సవ భ్రహ్మలీన వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొని ప్రత్యక పూజలు నిర్వహించి శబరీ మాతా ఆశిశులు అందుకున్నారు. ఎల్లారెడ్డి ప్రజలు ఎల్లపుడు సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్ని భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, అభిమానులు పాల్గొన్నారు.

