బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని అంతపల్లి గ్రామానికి ఆనుకొని ఉన్న ఎన్ హెచ్ 44 హైవేపై నీరు వృథాగా పారుతున్నాయి. గ్రామాలలో ప్రజలు నీరు లేక ఇబ్బందులకు గురవుతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. నీరు వృథా చేయడం ఏంటి అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలకు మిషన్ భగీరథ నీరు అందించాలని సంబంధిత అధికారులను ప్రజలు కోరుతున్నారు.

