.. మిస్సింగ్ కేసు నమోదు
కోటగిరి , బతుకమ్మ:
కోటగిరి మండల కేంద్రంకు చెందిన వన్నే నాగారాజు (15) అనే విద్యార్థి ఈ నెల 11 నుంచి అదృశ్యమయ్యారు. కోటగిరి మండల కేంద్రంలో చదువుకునే నాగారాజు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేయడంతో కోటగిరి పోలీస్ స్టేషన్ లో బాలుడి మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నాగారాజు అచూకి తెలిసిన వారు కోటగిరి ఎస్ఐ 8712659878, సిఐ రుద్రూర్ 8712659875 కి సమాచారం అందించాలని కోరారు.