నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలిక అదృశ్యమైంది. అహ్మద్ పురా కాలనీకి చెందిన బాలిక ప్రస్తుతం ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఇంటి నుంచి వెళ్లిన బాలిక తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో తెలిపారు.
