రుద్రూర్, బతుకమ్మ :
పిట్లం నుండి పాదయాత్రగా బాసర అమ్మవారి దర్శనానికి వెళుతున్న భక్తులకు రుద్రూర్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద నాయకులు భక్తులకు పాలు, బిస్కెట్ ప్యాకెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండూరి ప్రశాంత్ గౌడ్, బాన్సువాడ బిజెపి సీనియర్ నాయకులు మార్కలి ప్రకాష్ పటేల్, పార్వతీ మురళి, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఉపాధ్యక్షులు బేగరి వినోద్ కుమార్, భోజికొండ అనిల్, రేపల్లి సాయిప్రసాద్, ప్రధాన కార్యదర్శి వడ్ల సాయినాథ్, యువ మోర్చా మండల అధ్యక్షులు కుమ్మరి గణేష్, మండల కోశాధికారి కటిక రామరాజు, రజినీకాంత్, నడిపి రాజేష్, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

