బతుకమ్మ, బోధన్: మహారాష్ట్రలోని బిలోలి నుంచి బోధన్కు వస్తున్న ఆటోను శుక్రవారం మర్రి మైసమ్మ దేవాలయం సమీపంలో తనిఖీ చేయగా అక్రమంగా రవాణా చేస్తున్న 1.270 కిలోల గంజాయి స్వాధీనం చేసినట్లు తెలిపారు. ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. బిలోలికి చెందిన గోనేకర్ గణేష్ కాశీనాథ్, బోధన్ కు చెందిన గాడే శేఖర్, నిజామాబాద్ కు చెందిన షేక్ అబ్దుల్ ఖైసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ రవాణాను అడ్డుకున్న సిబ్బందిని ఏసీపీ శ్రీనివాస్ అభినందించారు. డ్రగ్స్ వాడకాన్ని నిర్మూలించేందుకు పోలీసుల చర్యలు మరింత పటిష్టం చేస్తామని అన్నారు.
