- అరే రవీందర్ ఆధ్వర్యంలో ఏ. డీ టీం వినూత్న ప్రచారం
భీమ్ గల్, బతుకమ్మ : దేశ రాజధాని ఢిల్లీలోమనోళ్లు మండలంలోని మెండోరా మాజీ ఎంపిటీసి అరే రవీందర్ ఆధ్వర్యంలోని ఆరవింద్ ధర్మపురి టీం వినూత్న ప్రచారం చేస్తున్నారు. గత 15 రోజులుగా అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మనక్కాడోళ్ళైనా సీనియర్ బీజేపీ నాయకులు బీజేపీ ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.ఈ క్రమంలో గురువారం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ప్రచారం కు వెళ్లిన మనోళ్లకు పార్లమెంట్ భవనాన్ని చూయించి,పలువురు కేంద్ర మంత్రులను కలిపించి, పార్లమెంట్ లో జరిగే సమావేశాలను గురించి వివరించి తెలపడంతో పాటు సమావేశాల నిర్వహణను చూపించారని మనోళ్లు బతుకమ్మ కు ఫోన్ లో తెలిపారు.

