బతుకమ్మ, మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బీబీపేట్ మండలంలో ని కేజీబీవీ పాఠశాల ను మండల ప్రత్యేక అధికారి ఎం.శ్రీనివాస్ మంగళవారం తనిఖీ చేశారు. కేజీబీవీ లోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివరాం రెడ్డి పల్లి గ్రామంలో మోడల్ ఇందిరమ్మ హౌస్ నిర్మాణం పనులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో ఎంపీవో హాజరయ్యారు.
