జుక్కల్, బతుకమ్మ :
లోలెవల్ వంతెనలతో జుక్కల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఏళ్ల తరబడి నరకయాతన అనుభవిస్తు న్నారు. జుక్కల్ – పేద్ద పెద్ద ఏడ్డి, తాడ్గుర్ ప్రధాన రహదారిపై ఉమ్మడి మద్నూర్ మండలంలోని అంతాపూర్, గోజేగావు, కుర్లా, ఎంబుర, ఇలేగావు, టాక్షి, సిర్పూర్, బిచ్కుంద మండలంలోని మిషన్ కల్లాలి, గుండె కల్లూర్, నిజాం సాగర్ మండలం నాగమడుగు అచ్చంపేట గ్రామాల వద్ద ఉన్న లోలెవల్ వంతెనలు వానాకాలం వచ్చిందంటే చాలు ప్రజలకు శాపంగా మారుతున్నాయి. ఒక్క భారీ వర్షం కురిస్తే చాలు ఈ వంతెనలు నీట మునిగి రాకపోకలు పూర్తిగా స్తంభిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్నా, నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంబులెన్స్ లు సైతం గ్రామాల్లోకి రాలేని దుస్థితి నెలకొంటోంది.
