ఎల్వోసీ అందజేత

0 14,542

భీమ్ గల్, బతుకమ్మ: భీంగల్ మండలం  బాబాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ హయత్ ఇటీవల యాక్సిడెంట్ కి గురై నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేరడంతో ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు గౌరవ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి  దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి మెరుగైన చికిత్స కొరకు రూ.1 లక్షల ఎల్వొసి  మంజూరు చేయించి ఎల్ వో సీ కాపీ ని వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం   హైదరాబాద్ లోని నివాసంలో  అందజేశారు. నిరుపేదలమైన మాకు మెరుగైన వైద్య చికిత్స కొరకు రూ.1 లక్ష  ఎల్ఓసి  మంజూరు చేసిన ప్రశాంత్ రెడ్డి మేలు మర్చి పోలేమని ఈ సందర్భంగా  వారి కుటుంబ సభ్యులు  మాజి మంత్రి,ఎమ్మెల్యే వేములకు కృతజ్ఞతలు తెలియజేసారు.

Leave A Reply

Your email address will not be published.