29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎల్ఓసి అందజేత

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామానికి చెందిన జక్కుల పరన్  కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స కొరకు హైదరాబాద్  నిమ్స్ హాస్పిటల్ లో చేరారు. వైద్యులు కిడ్నీ మార్పిడి చేయాలని సూచించగా అతని అమ్మ భూదేవి కుమారుడికి కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రాగా వారి చికిత్స ఖర్చుల నిమిత్తం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ని  సంప్రదించగా ఆయన జక్కుల పరన్ కు రూ. 2,50,000  ఎల్ఓసి అలాగే భూదేవి కిడ్నీ మార్పిడి చికిత్సకు రూ.1,50,000 ఎల్ ఓ సి లను ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అందించడం జరిగింది. ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్ కు వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article