27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నాటుదాం ఒక చెట్టు.. అమ్మ పేరు మీద..

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: అమ్మ పేరు మీద నాటిన మొక్కను ప్రత్యేక సంరక్షణలో కాచి కాపాడాలని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. మోర్తాడ్ మండలంలో గురువారం నాటుదాం ఒక చెట్టు.. అమ్మ పేరు మీద.. అనే నినాదంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో వన మహోత్సవాల్లో భాగంగా తమ వంతుగా మొక్కను నాటి సంరక్షించే బాధ్యత తీసుకొని మొక్కలను కాపాడాలని పేర్కొన్నారు. మండల కేంద్రంతోపాటు దోన్ పాల్, డొంకల్, పాలెం, తిమ్మాపూర్, షెట్పల్లి, ధర్మోరా, వడ్యాట్, గాండ్లపేట్ గ్రామాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండల పంచాయితీ అధికారి శ్రీధర్, పంచాయితీ కార్యదర్శి ప్రశాంత్, శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు ముత్యాల రాములు పరస దేవన్న, ఫీల్డ్ అసిస్టెంట్లు రమేష్, ప్రవీణ్, శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article