నిజామాబాద్, బతుకమ్మ: నిజాంసాగర్ మండలం ఆన్సన్ పల్లి గ్రామంలో దళిత మహిళపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం పలువురు సామాజిక, రాజకీయ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మాల దళిత నాయకుడు బంగారు సాయిలు ఆధ్వర్యంలో శేఖ్ హుస్సేన్, ఇతర నాయకుల బృందం బాధితురాలి వద్దకు వెళ్లి ఆమెకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అన్వర్ అలీ, రవి, రాజేందర్ తదితరులు తెలిపారు.
