మద్నూర్, బతుకమ్మ: రైతు భరోసా పథకం కోసం భూముల సర్వేను శనివారం సుల్తాన్ పెట్ గ్రామంలో నిర్వహించారు సర్వేను మద్నూర్ మండల తహసిల్దార్ సర్వేను పరిశీలించారు. సాగులో లేని ఇళ్ల స్థలాలు, కాలనీలుగా మారిన అన్ని రకాల భూములు, పరిశ్రమలు, గోదాములు, మైనింగ్ లను, రాళ్లు, రప్పలు, గుట్టలతో నిండి సాగుకు అనుగుణంగా లేని భూముల వివరాలను సేకరించారు. రెవిన్యూ అధికారులు రవి కుమార్, హనుమాన్లు, దశరథ్, అగ్రికల్చర్ అధికారి ఏఈఓ శివలింగ పాల్గొన్నారు.
