వెబ్ న్యూస్, బతుకమ్మ : చింత చచ్చినా పులుపు చావదు అన్నట్లుగా కేటీఆర్ పరిస్థితి ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. జూబ్లీహిల్స్ లో చిత్తుగా ఓడిపోయినా ఆయనలో అహంకారం మాత్రం తగ్గలేదన్నారు. జనం ఛీ కొట్టినా ఇంకా అదే బలుపు చూయిస్తున్నాడని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, ఫేక్ సర్వేల పేరుతో మైండ్ గేమ్లు ప్లే చేసినా జనం ఛీ కొట్టారని పేర్కొన్నారు. కర్మ ఈజ్ బ్యాక్ అని సొంత చెల్లెలే చెపుతుందన్నారు.
