హైదరాబాద్, బతుకమ్మ: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ విచారణకు లాయర్ ను అనుమతించాలని ఆయన పిటిషన్ వేయగా, హై కోర్టు మధ్యాహ్నం విచారించనుంది. ఫార్ములా ఈ – కార్ రేస్ కేసులో ఏ-1గా ఉన్న కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హై కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.