హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ , ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తో శుక్రవారం పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనిపూర్ రాజారెడ్డి సమావేశమయ్యారు. రాజారెడ్డి మాట్లాడుతూ 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నానని యూనివర్సిటీ ఎన్ ఎస్ యూఐ అధ్యకుడిగా పనిచేశానని, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ లో పది సంవత్సరాలు పనిచేశానని ఎన్ని ఇబ్బందులున్న పార్టీ వదలలేదని రాజారెడ్డి మీనాక్షి నటరాజన్ కు వివరించారు. మీనాక్షి నటరాజన్ స్థానిక ఎన్నికల్లో పార్టీ మద్దతు దారుల గెలుపునకు కృషి చేయాలని సూచించారని ఆయన చెప్పారు.
