బతుకమ్మ,మోర్తాడ్: దోమల ద్వారా డెంగ్యూ వంటి వ్యాధు వాపిస్తాయని కావున ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, చికెన్ గున్యా తదితర వ్యాధుల నివారణ మనందరి బాధ్యత అని వైద్య సిబ్బంది సద్గుణ ప్రజలకు అవగాహన కల్పించారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొని మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలోని వైద్య సిబ్బంది గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు వ్యాధి వల్ల కలిగే నష్టాలను తెలియజేశారు. కార్యక్రమంలో లావణ్య దీప ఆశ వర్కర్లు శ్యామల, సరిత, లత తదితరులు పాల్గొన్నారు.