హైదరాబాద్, బతుకమ్మ : అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ లోని నందినగర్ నివాసం నుంచి మాజీ సీఎం, ప్రతిపక్షనేత కేసీఆర్ సోమవారం అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ సమావేశాలు ఈఉదయం నుంచి ప్రారంభం కానున్నాయి. మరో వైపు నీళ్ల జగడంపై ప్రతిపక్ష, అధికార పక్ష నేతల మధ్య వాడి వేడి చర్చలు జరగనున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. ప్రతిపక్షాల వ్యూహాలను దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది.
