
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతానని హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. త్రివేణి సంగమం వద్ద వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య గోదావరికి హారతి ఇచ్చారు. అనంతరం ఆర్ ఎస్ ఎస్ వ్యవస్థాపకులు కేశవ బలిరాం హెడ్గే వార్ స్మృతి మందిరాన్ని సందర్శించారు. తెలంగాణ బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. కార్తీక మాసంలో గంగా హారతి ఇవ్వడం తనకి ఎంతో ఆనందంగా ఉందన్నారు.

