బాల్కొండ, బతుకమ్మ : బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల్లో అండర్ 17 ఇయర్స్( బాల, బాలికల ) కబడ్డీ సెలక్షన్ నిర్వహించడం జరుగుతుందని పిజికల్ డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు. త్వరలో జరిగే SGF జిల్లాస్థాయి కబడ్డీ టోర్నమెంట్ కు బాల్కొండ జోన్ టీంలను సన్నద్ధం చేయడం కొరకు తేదీ 17.10.2025 రోజు జెడ్ పి హెచ్ ఎస్ ముప్కాల్ లో గంగారం (PGHM) కన్వీనర్ , ఆర్గనైజర్ సెక్రెటరీ ప్రసాద్ ఆధ్వర్యంలో కబడ్డీ సెలక్షన్స్ ను నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు శుక్రవారం నాడు ఉదయం 9 30 నిమిషాలకు జడ్పిహెచ్ఎస్ ముప్కాల్ మైదానంలో రిపోర్ట్ చేయాలనీ తెలియజేశారు. వచ్చేముందు ఏజ్ ప్రూఫ్ కొరకు బోనఫైడ్ సబ్మిషన్ చేయవలెను. ఒక్కొక్క పాఠశాల నుండి నలుగురు క్రీడాకారులకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు.